Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ ఆలయంలో నాలుక కోసుకున్న వ్యక్తి!!

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (15:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఓ వ్యక్తి ఆలయంలో నాలుక కోసుకున్నాడు. శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఆ తర్వాత బ్లేడుతో తన నాలుకను కోసుకున్నాడు. దీన్ని గమనించిన ఆలయ సిబ్బంది, ఇతర భక్తులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ పనికి పాల్పడిన వ్యక్తిని వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన మహేశ్‌గా గుర్తించారు. 
 
హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉండే మహేశ్.. చంద్రబాబును సీఎంగా తిరిగి చూడాలని బలంగా కోరుకునేవాడు. ఈ క్రమంలో స్థానిక వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత బ్లేడుతో నాలుక కోసుకున్నాడు. సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేశ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ సందర్భంగా నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ మహేశ్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి 100 నుంచి 145 సీట్లలో గెలవాలని ఆకాంక్షించాడు. కాగా, జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలంటూ గతంలో కూడా ఈయన ఇదే పనికి పాల్పడినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఘనంగా "కావేరి" మూవీ సక్సెస్ మీట్

కాలం రాసిన కథలు సక్సెస్ సెలబ్రేషన్స్

రీసెంట్‌ టైమ్స్‌లో బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం': మహేష్ బాబు

జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర- భార్య నుదుటపై కుంకుమ (వీడియో)

కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు : శ్రీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోంగూర తింటే కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గాలా? ఐతే ఈ డ్రింక్స్ తాగి చూడండి

స్టేజ్ III నాలుక క్యాన్సర్‌తో బాధపడుతున్న 91 ఏళ్ల వృద్ధుడిని కాపాడిన విజయవాడ ఏఓఐ

నేతితో వంకాయ వేపుడు ఎలా?

టీలో కల్తీని గుర్తించటం ఎలా?: ప్రతి వినియోగదారుడు తెలుసుకోవలసిన అంశాలు

తర్వాతి కథనం
Show comments