Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ ఆలయంలో నాలుక కోసుకున్న వ్యక్తి!!

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (15:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఓ వ్యక్తి ఆలయంలో నాలుక కోసుకున్నాడు. శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఆ తర్వాత బ్లేడుతో తన నాలుకను కోసుకున్నాడు. దీన్ని గమనించిన ఆలయ సిబ్బంది, ఇతర భక్తులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ పనికి పాల్పడిన వ్యక్తిని వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన మహేశ్‌గా గుర్తించారు. 
 
హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉండే మహేశ్.. చంద్రబాబును సీఎంగా తిరిగి చూడాలని బలంగా కోరుకునేవాడు. ఈ క్రమంలో స్థానిక వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత బ్లేడుతో నాలుక కోసుకున్నాడు. సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేశ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ సందర్భంగా నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ మహేశ్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి 100 నుంచి 145 సీట్లలో గెలవాలని ఆకాంక్షించాడు. కాగా, జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలంటూ గతంలో కూడా ఈయన ఇదే పనికి పాల్పడినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments