Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ ఆలయంలో నాలుక కోసుకున్న వ్యక్తి!!

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (15:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఓ వ్యక్తి ఆలయంలో నాలుక కోసుకున్నాడు. శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఆ తర్వాత బ్లేడుతో తన నాలుకను కోసుకున్నాడు. దీన్ని గమనించిన ఆలయ సిబ్బంది, ఇతర భక్తులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ పనికి పాల్పడిన వ్యక్తిని వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన మహేశ్‌గా గుర్తించారు. 
 
హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉండే మహేశ్.. చంద్రబాబును సీఎంగా తిరిగి చూడాలని బలంగా కోరుకునేవాడు. ఈ క్రమంలో స్థానిక వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత బ్లేడుతో నాలుక కోసుకున్నాడు. సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేశ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ సందర్భంగా నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ మహేశ్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి 100 నుంచి 145 సీట్లలో గెలవాలని ఆకాంక్షించాడు. కాగా, జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలంటూ గతంలో కూడా ఈయన ఇదే పనికి పాల్పడినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments