Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక ఇబ్బందులే కారణం.. భార్యను గోడకేసి కొట్టాడు.. బిడ్డల్ని గొంతు నులిమి?

హైదరాబాద్ నగరంలో హత్యా నేరాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న నిశ్చితార్థం కుదుర్చున్న యువకుడు తన ప్రేయసిని హత్య చేసిన ఘటన మరవక ముందే.. సోమవారం ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను పొట్టనపెట

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (15:27 IST)
హైదరాబాద్ నగరంలో హత్యా నేరాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న నిశ్చితార్థం కుదుర్చున్న యువకుడు తన ప్రేయసిని హత్య చేసిన ఘటన మరవక ముందే.. సోమవారం ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను పొట్టనపెట్టుకున్నాడు. ఇందుకు కారణం ఆర్థిక ఇబ్బందులేనని.. అందుకే భార్యాపిల్లలను చంపేసి పోలీసుల ముందు లొంగిపోయాడట. 
 
వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల జిల్లెలగూడ సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన  హరీందర్‌గౌడ్ అనే వ్యక్తి తన భార్య జ్యోతి, ఆరేళ్ల కుమారుడు అభిజిత్, నాలుగేళ్ల కుమార్తె సహస్రలను గొంతు నులిమి చంపేశాడు. ఇక భార్యను గోడకేసి బలంగా కొట్టి చంపేశాడు. అమీర్‌పేట పోలీసులకు లొంగిపోయాడు. 
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో హరీందర్ గౌడ్ నడుపుతున్న క్లినిక్ సరిగ్గా నడవకపోవడంతో ఏర్పడిన తగాదాలో ఆవేశానికి గురైన హరీందర్ భార్యాపిల్లలను హతమార్చాడని సమాచారం అందుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments