Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీషపై అత్యాచారం జరిగిందా? : డీసీపీ ఏమంటున్నారు?

హైదరాబాద్ బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం జరిగిందో లేదో తేల్చుతామని హైదరాబాద్ నగర డీసీపీ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులపై లేనిపోని విమర్శలు చేయవద్దని ఆయన హెచ్చరించారు.

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (11:50 IST)
హైదరాబాద్ బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం జరిగిందో లేదో తేల్చుతామని హైదరాబాద్ నగర డీసీపీ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులపై లేనిపోని విమర్శలు చేయవద్దని ఆయన హెచ్చరించారు. 
 
ఈ ఆత్మహత్య కేసు వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ఈ కేసులో శిరీష బంధువులు లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో డీసీపీ స్పందించారు. శిరీష అనుమానాస్పద మృతి విషయంలో విచారణను వేగవంతం చేశామన్నారు. నిందితులు రాజీవ్, శ్రవణ్‌లతో పాటు పలువురిని ప్రశ్నించామని తెలిపారు. 
 
ఈ కేసులో అనవసర విమర్శలు చేయవద్దని హెచ్చరించారు. శిరీష బంధువులకు ఏమైనా అనుమానాలు ఉంటే హైదరాబాద్‌కు రావాలని, వారి అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని తెలిపారు. శిరీష పంపిన వాట్స్‌యాప్ లొకేషన్ కుకునూరుపల్లి పీఎస్ క్వార్టర్స్ దేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన, ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతనే తెలుస్తుందన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments