Webdunia - Bharat's app for daily news and videos

Install App

64 రోజుల పాటు దీక్షకు కూర్చున్న బాలిక.. సెల్ఫీలు తీసుకున్నారు.. పట్టించుకోలేదు.. కానీ?

టెక్నాలజీ ఎంతగా పెరిగినా.. మూఢనమ్మకాలు మాత్రం మరుగున పడనే లేదు. మత గురువులు ఆదేశించారని.. బాలికను 64 రోజుల ఉపవాస దీక్షకు కూర్చోబెట్టి.. ఆమె ప్రాణాలు బలిగొన్నారు. ఏకంగా 64 రోజులు ఆకలిని దింగమింగుకుని,

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (13:04 IST)
టెక్నాలజీ ఎంతగా పెరిగినా.. మూఢనమ్మకాలు మాత్రం మరుగున పడనే లేదు. మత గురువులు ఆదేశించారని.. బాలికను 64 రోజుల ఉపవాస దీక్షకు కూర్చోబెట్టి.. ఆమె ప్రాణాలు బలిగొన్నారు. ఏకంగా 64 రోజులు ఆకలిని దింగమింగుకుని, మతపెద్దలు చెప్పారని, తల్లిదండ్రులు చెప్పారని ఆ బాలిక దీక్షకు కూర్చుంది. అయితే 64 రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆకలి బాధను దిగమింగుకుని... అస్వస్థతతో చివరికి మృత్యుఒడికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్‌ పాట్‌ బజార్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న బంగారు నగల వ్యాపారి లక్ష్మీ చంద్‌ మానిష్‌, సమారియా దంపతులు. వీరి కూతురు ఆరాధన. ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. వారి మతాచారం ప్రకార ఆరాధనను 64 రోజుల ఉపవాస దీక్షకు కూర్చో బెట్టారు. ఆమె దీక్ష అక్టోబర్‌ 1న ముగిసింది. 
 
దీక్ష సమయంలో సాయంత్రం 6 గంటల లోపు కేవలం మంచినీళ్లు మాత్రమే తాగాల్సి ఉంటుంది. దీంతో ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. దీక్ష మధ్యలో అనేక సార్లు స్పృహ కోల్పోయింది. సెల్ఫీలు తీసుకున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీక్ష ముగిసిన మూడో రోజున ఈ నెల 3న బాలిక స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందతూ అదే రోజు మరణించింది. బాలిక మృతిపై బాలల హక్కుల సంఘం నాయకులు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments