Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజలు పేరుతో భార్యను అడవిలోకి తీసుకెళ్లి హతమార్చిన భర్త

భార్యపై అనుమానం పెనుభూతమైంది. పూజ పేరుతో అడవిలోకి తీసుకెళ్లి భార్యను హతమార్చిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌ మండలం పలుగు తండాకు చెందిన రమావత్‌ శ్ర

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (10:09 IST)
భార్యపై అనుమానం పెనుభూతమైంది. పూజ పేరుతో అడవిలోకి తీసుకెళ్లి భార్యను హతమార్చిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌ మండలం పలుగు తండాకు చెందిన రమావత్‌ శ్రీరాం, రమావత్‌ లలిత(20) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. 
 
వీరిద్దరూ తుక్కుగూడలో నివసిస్తున్నారు. దంపతులిద్దరి మధ్య కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి యాచారం మండలం తాటిపర్తి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో గల తాటికొండ మైసమ్య ఆలయానికి సోమవారం తీసుకెళ్లాడు. 
 
పూజలు చేసిన అనంతరం ఆలయం పక్కనగల అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మాటల్లో పెట్టి గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే విడిచిపెట్టి వచ్చేశాడు. ఆ తర్వాత మరుసటి రోజు తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, రమావత్‌ వ్యవహారశైలిని సందేహించిన పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా, తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. 
 
ఆమెపై అనుమానంతో తానే చంపేసినట్టు తెలిపారు. తాటికొండ మైసమ్మ దేవాలయం వద్ద అటవీ ప్రాంతంలో చంపేసి పడవేశానని చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. మృతదేహం కుళ్లిపోయి ఉంది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments