Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెంపలపై కొట్టి.. చున్నీతో మెడబిగించి హత్య చేసిన భర్త... ఏమీ తెలియనట్టుగా కేకలు..

కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న కసాయి భర్త... ఆమెను కొట్టి చంపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:32 IST)
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న కసాయి భర్త... ఆమెను కొట్టి చంపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన ఫిరంగి సాయికృష్ణతో రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన నాదెండ్ల నాగేశ్వరరావు కుమార్తె రజని (20)కి గతేడాది వివాహమైంది. గత ఆరునెలలుగా భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య తరచూ చిన్నపాటి గొడవలు జరుగుతూ వచ్చాయి. భర్తతో కలిసి జీవించలేక రజనీ పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
అయితే, తల్లిదండ్రులతో పాటు పంచాయతీ పెద్దలు నచ్చజెప్పి తిరిగి కాపురానికి పంపించారు. బుధవారం ఉదయం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భర్త సాయికృష్ణ, భార్య రజనిని ముందుగా చెంపలపై కొట్టి తర్వాత చున్నీతో మెడబిగించి చంపివేశాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్టుగా ఎరగనట్లు కేకలు వేశాడు. ఈ అరుపులు విన్న చుట్టుపక్కల వారు.. ఇంటికి వచ్చి చూడగా, రజనీ కిందపడిపోయివున్నది. 
 
దీంతో సమాచారాన్ని రజినీ తల్లిదండ్రులకు చేరవేశారు. తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన పిన్నెల్లి గ్రామానికి చేరుకున్నారు. బంధువులు, తల్లిదండ్రులు సాయికృష్ణను నిలదీసి అడుగగా అనుమానంతో తానే చంపానంటూ అంగీకరించాడు. రజనీ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments