Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం: గొడ్డలితో హత్య చేసిన భర్త.. అనంతలో దారుణం

Webdunia
ఆదివారం, 5 జులై 2015 (16:34 IST)
అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త ఆమెను పాశవికంగా హత్యచేశాడు. ఈ ఘటన జిల్లాలోని కనగానపల్లి మండలం, కుర్లపల్లిలో చోటుచేసుకుంది. 
 
కుర్లపల్లి గ్రామానికి చెందిన ఆకులప్ప అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి దాటాక భార్యపై గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. అనంతపురం, గుత్తి మండలంలోని రజాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంతకల్లు నుంచి గుత్తి వస్తున్నఆటో రజాపురం వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments