Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్ కార్డుల్లో సవరణల కోసం చక్కని అవకాశం.. సద్వినియోగం చేసుకోండి..

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (11:52 IST)
అమరావతి.. అక్టోబర్ 15న డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ పబ్లికేషన్ – 2020 జనవరిలో తుది జాబితా ప్రచురణ: సీఈవో కె.విజయానంద్..

భారత ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1 వ  తేదీ నుంచి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు ఓటర్ల పేర్లల్లో, చిరునామాల్లో తదితర లోపాలను సవరించడం కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ ను నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. 
 
ఈ స్పెషల్ సమ్మరి రివిజన్‌లో భాగంగా ఇప్పటికే ఓటర్లుగా నమోదు అయిన వారు వారి ఓటర్ కార్డులో పేర్లలో  తప్పులు, బంధుత్వం లో తేడాలు, చిరునామా లో తప్పులు, తదితరులు సరిచేసుకునేందుకు ఒక చక్కని అవకాశాన్ని కల్పించడం జరుగుతోందన్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 1వ తేదీన బూత్ లెవెల్ కేంద్రాల వద్ద బీఎల్ వో లు అందుబాటులో ఉంటారని తెలియజేశారు.
 
రాష్ట్రంలో 11 వేల కామన్ సర్వీస్ సెంటర్‌లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. పై మార్పుల కోసం సంబంధిత వ్యక్తికి సంబంధించిన పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రేషన్ కార్డు, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు జారీ చేసే గుర్తింపు కార్డులు , బ్యాంక్ పాస్ బుక్, రైతు గుర్తింపు కార్డు, కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపునచ్చిన అధికారిక పత్రాలతో మార్పులు చేర్పుల కోసం సంబంధిత ఎన్నికల సిబ్బందిని, అధికారులను సంప్రదించవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ల కార్యాలయంలోనూ, డివిజన్ స్థాయిలోనూ, తహశీల్ధార్ కార్యాలయంలోనూ ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 
 
 
 
ఇంటివద్ద నుంచే మార్పులకు అవకాశం :
 
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున NVSP(నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్), ఓటర్స్ హెల్ప్, 1950 కాల్ సెంటర్, ద్వారా తగిన మార్పులను చేసుకోవడానికి అవకాశం ఉందని కె.విజయానంద్ తెలిపారు. సంబంధిత మార్పుల కోసం ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ధారించుకొని సరిచేయడం జరుగుతుందన్నారు. 
 
మార్పులు చేర్పుల కోసం ఫారమ్-8 ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవచ్చన్నారు. మరణించిన, చిరునామ మారిన ఓటర్ల కోసం ఫారమ్-7 అందుబాటులో ఉంచడం జరుగుతుందని వారికి సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు ధృవీకరిస్తూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. బీఎల్ వోలు క్షేత్రస్థాయిలో నిర్ధారణ తర్వాత మాత్రమే తగిన చర్యలు తీసుకుంటారన్నారు. 
 
ఇప్పటివరకు నమోదుకాని ఓటర్ల కోసం, 2019, జనవరి 1 వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఫారమ్-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. పీడబ్ల్యూడీ ఓటర్లు 1950 హెల్ప్ లైన్ ద్వారా వివరాలు తెలియజేస్తే ఓటర్ల నమోదుకు సంబంధించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments