Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డి పార్టీకి పరోక్షంగా డ్యామేజ్ చేస్తున్న కేసీఆర్, ఎలా?

ఐవీఆర్
బుధవారం, 24 ఏప్రియల్ 2024 (12:18 IST)
కేసీఆర్. గత పదేళ్లలో ఏనాడు కూడా ఓ టీవీ ఛానల్ ఆఫీసుకి వెళ్లి మాట్లాడిన సందర్భం వుందా అంటే లేదనే చెప్పాలి. అలాంటి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రముఖ టీవీ ఛానల్ టీవీ9తో అనేక విషయాలు ముచ్చటించారు. ప్రస్తుతం ఏపీలో మే 13న ఎన్నికలు జరుగునున్న నేపధ్యంలో కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేసారు. తనకు అందుతున్న సమచారం ప్రకారం ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ రాబోతోందని జోస్యం చెప్పారు. ఐతే కూటమి గెలుస్తుందని మరికొందరు అంటున్నారు కదా అంటే... ఐనా పక్క రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు గురించి తను ఆలోచించడం లేదన్నారు. అంతేకాదు... ఏపీలో భారాస కార్యాలయం ఏర్పాటు పైన కూడా ఇప్పుడు ఆలోచన చేయడం లేదని ఆయన వెల్లడించారు.
 
ఇదిలావుంటే... ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చే అవకాశం వున్నదని కేసీఆర్ అనడంతో కాస్తోకూస్తో పడే ఓట్లు కూడా పడే అవకాశం పోతుందని కొందరు అంటున్నారు. దీనికి కారణం... ఏపీ విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూలకారణం కేసీఆర్ అనీ, అలాంటి నాయకుడు మద్దతు ఇచ్చే పార్టీకి ఓట్లు ఎలా వేస్తామంటూ అప్పుడే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తమ్మీద ఎన్నికల వేళ కేసీఆర్ మరోసారి జగన్ మోహన్ రెడ్డి పార్టీకి పరోక్షంగా డ్యామేజ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments