Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లింట్లో విషాదం.. పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు డాబాపై నుంచి పడి మృతి

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (12:34 IST)
విజయనగరం జిల్లా రాజాంలో ఒక పెళ్లింటి విషాదం చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు ప్రమాదవశాత్తు డాబాపై నుండి జారిపడి మృతి చెందాడు. దీంతో రాజాం పట్టణంలో విషాదచాయలు అలముకున్నాయి. స్థానికుల తెలిపిన సమాచారం ప్రకారం... బుధవారం రాత్రి రాజాం సూర్య దుర్గ కళ్యాణ్ మండపంలో రాత్రి 12.55 నిమిషాలకు వజ్జిపర్తి సూర్యరావు అనే యువకుడికి వివాహం జరగవలసి ఉన్నది. వరుడు సూర్యారావు రాత్రి డాబాపై పడుకున్నాడు. అయితే, ప్రమాదవశాత్తు తెల్లవారుజామున పైనుంచి నిద్రమత్తులో డాబాపై నుంచి క్రిందకు పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
హుటాహుటిన బంధువులు రాజాం ఆసుపత్రికి తీసుకు వెళ్ళగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ చికిత్స పొందుతూ వరుడు మృతి చెందాడు. పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు అదే రోజు మృతిచెందడంతో పెళ్లింట్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వీరి స్వగ్రామం బలిజిపేట మండలం పెద్దపంకి గ్రామం వీరి కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా రాజంలో నూడుల్స్ బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నారని స్థానికులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments