Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ యాజమాన్యాలు ప్రభుత్వానికి సహాయపడాలి: గుంటూరు జిల్లా కలెక్టర్

Webdunia
గురువారం, 7 మే 2020 (19:17 IST)
కరోనా వైరస్ నేపధ్యంలో విదేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని వారి స్వస్థలాలకు చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, విదేశాల నుండి వచ్చే వారిని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ చేసి పర్యవేక్షణ చేస్తామని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో విదేశాల నుండి వచ్చే వారిని హోటల్ క్వారంటైన్ లో ఉంచేందుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై గుంటూరులోని హోటల్ యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హోటల్ యజమానులతో మాట్లాడుతూ, జిల్లాలో ఎన్ని హోటళ్ళు వున్నాయి, వాటిలో ఎన్ని సింగల్, డబల్ రూములు గలవి వున్నాయి, వాటి టారిఫ్ రెట్లు తెలియజేయాలన్నారు.  హోటళ్ళలో రెస్టారెంట్ వుంటే అల్పాహారం, భోజనం, డిన్నర్ కు మెనూ తయారు చేసి వాటి రెట్లు కూడా తెలియజేయాలన్నారు. 
 
రెస్టారెంట్ లేని వారు రూము టారిఫ్ ను కోడ్ చేయాలని తెలిపారు.  ఈ కరోనా సమయంలో హోటల్ యాజమాన్యాలు ప్రభుత్వానికి సహాయపడాలని కోరారు. ఈ సమావేశంలో  జిల్లా హోటల్ యాజమాన్యాల అసోసియేషన్ ప్రెసిడెంట్ వి రాయల్ పార్క్ హోటల్ యజమాని కిశోర్, వివిధ హోటల్ యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments