Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్షన్ 8 ముగిసిన అధ్యాయం : కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ

Webdunia
బుధవారం, 1 జులై 2015 (09:28 IST)
హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విభజన చట్టంలో రూపొందించిన సెక్షన్ 8 అంశం ఇపుడు ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. 
 
గత ఏడాది జూన్‌ 4వ తేదీన సెక్షన్‌ 8 అమలుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారాలు కట్టబెడుతూ తెలంగాణ బిజినెస్‌ రూల్స్‌లో మార్పులు చేయాలని ఈ లేఖలో సూచించింది. అయితే... ఈ లేఖను ఉపసంహరించుకోవాలని గత ఏడాది జూన్‌ 27వ తేదీన రాజ్యసభలో పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కోరారు. 
 
దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఈ నెల 16వ తేదీన సమాధానమిస్తూ పాల్వాయికి లేఖ రాశారు. ‘కేంద్రం రాసిన లేఖకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రాజ్యాంగం, పునర్విభజన చట్టం ప్రకారం శాంతి భద్రతల బాధ్యతను నిర్వర్తిస్తామని హామీఇచ్చింది. దీంతో ఈ అంశం ముగిసింది. కాబట్టి, లేఖను ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదు’ అని మంత్రి స్పష్టంచేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments