Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్‌పై హోం మంత్రి అమిత్ షా ఆరా!!

ఠాగూర్
బుధవారం, 26 మార్చి 2025 (10:51 IST)
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న మద్యం స్కామ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభ వేదికగా చేసిన ఆరోపణలపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఎంపీకి తన కార్యాలయానికి పిలుపించుకుని ఏపీ లిక్కర్ స్కామ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ఎంపీని తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు సేకరించారు. 
 
సోమవారం లోక్‌సభ టీడీపీ ఎంపీ లావు మాట్లాడుతూ, ఏపీలో మద్యం స్కాంకు కారకులైన వారిపై దర్యాప్తు చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా శ్రీకృష్ణదేవరాయలను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకున్న హోం మంత్రి  అమిత్ షా ఆయనను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 
 
ఢిల్లీ మద్యం స్కాం‌తో పోల్చితే ఏపీలో ఈ స్కామ్ ఎన్నో రెట్లు అధికంగా జరిగిందని మంత్రికి లావు వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ఆయన హోంమంత్రికి అందజేశారు. రూ.90 వేల కోట్ల మద్యం వ్యాపారంలో రూ.18 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, మరో రూ.4 వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించారని లావు సంచలన ఆరోపణలు చేశారు. వీటిపైనే హోం మంత్రి ఆరా తీశారు. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఎన్.సునీల్ రెడ్డి దుబాయ్‌కు చెందిన రూ.2 వేల కోట్లను తరలించినట్టుగా ధృవీకరించే కీలక పత్రాలను ఈ సందర్భంగా అమిత్ షాకు ఎంపీ అందించారు. ఏపీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరిపిస్తామని ఈ సందర్భంగా హోం మంత్రి ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ కుంభకోణం కారణంగానే ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారని లావు ఈ సందర్భంగా వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments