Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీ ఫైనల్స్‌ను ప్రారంభించిన హాకీ ఆంధ్రప్రదేశ్ సభ్యుడు రాజశేఖర్

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (23:54 IST)
క్రీడా స్పూర్తితో ముందడుగు వేస్తే విజయం తధ్యమని హాకీ ఆంధ్రప్రదేశ్ సభ్యుడు, రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పిఎస్ రాజశేఖర్ అన్నారు. ఏలూరు సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేంద్రంగా జరుగుతున్న 13వ ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళల అంతర్ జిల్లా హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు గురువారం ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
 
కాకినాడ, అనంతపురం జిల్లా జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా, ఆ బృందాలను పరిచయం చేసుకుని పోటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ హకీ క్రీడకు పూర్వవైభవం తీసుకురావాలసిన బాధ్యత నేటి యువతపై ఉందని సూచించారు. శుక్రవారంతో పోటీలు ముగియనుండగా ఫైనల్స్‌కు కాకినాడ, విశాఖపట్నం జట్లు చేరుకున్నాయి.
 
గత మూడు రోజులుగా విభిన్న జిల్లాల నుండి వచ్చిన 14 జట్లు ఛాంపియన్ షిప్ కోసం పోటీ పడ్డాయి. కార్యక్రమంలో అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి సతీష్, పరిశీలకుడు రవిరాజా, రాష్ట్ర స్దాయి క్రీడాకారులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments