Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్‌ఐవీ పేషెంట్లు పెళ్లి చేసుకున్నారు.. వారానికే విడిపోయారు..

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (13:42 IST)
హెచ్‌ఐవీ పేషెంట్లు పెళ్లి చేసుకున్నారు. కానీ వారానికే విడిపోయారు. ఈ ఘటన మహబూబ్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు చెందిన ఓ వ్యక్తి హెచ్ఐవీతో బాధపడుతున్నారు. నెలలో రెండుమూడు సార్లు మహబూబ్ నగర్‌లోని కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చేవాడు. ఇదే క్రమంలో మహబూబ్ నగర్‌కు చెందిన ఓ యువతి సైతం కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లేది. 
 
ఈ క్రమంలో వీరిద్దరిని కౌన్సెలింగ్ కేంద్రం సిబ్బంది సమన్వయం కుదిర్చి ఫిబ్రవరి ఒకటో తేదీన వివాహం జరిపించారు. భార్యభర్తలిద్దరూ వారం రోజుల పాటు బాగానే కాపురం చేశారు. ఆ తర్వాత ఏమైందో గానీ ఓ రోజు భర్త సినిమాకు వెళ్తునానంటూ బయటకు వెళ్లాడు. మూడు నెలలైనా ఇంతవరకు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భార్య అత్తారింటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments