Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం ప్రభుత్వాసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన బాల‌య్య‌

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (11:16 IST)
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం ప్ర‌భుత్వాసుప‌త్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సౌకర్యాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పనితీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆస్పత్రిలో సమస్యలు నెలకొన్నాయని బాలకృష్ణ మండిపడ్డారు. గతంలో ఎక్కువగా ఉండే ఓపీ... నేడు చాలా తక్కువ సంఖ్యకు పరిమితమైందని అన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలో వెళ్లిపోయిందని ఆక్షేపించారు. వైకాపాకు సొంత ఖజానా నింపుకోవాలనే ఆరాటమే త‌ప్ప  అభివృద్ధి పట్టడం లేద‌ని విమ‌ర్శించారు. 
 
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందట్లేద‌ని, ఈ అంశంపై రోగుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయ‌ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఇంత అధ్వానంగా పరిస్థితులు ఉంటే, ఇతర ఆస్పత్రులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చ‌న్నారు. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాన‌ని నందమూరి బాలకృష్ణ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments