Webdunia - Bharat's app for daily news and videos

Install App

సదావర్తి భూముల కేసులో ఏపీ సర్కారుకు షాక్... సేల్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని ఆదేశం

సదావర్తి భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారుకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. కొనుగోలుదారులకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని మంగళవారం న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి రె

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:02 IST)
సదావర్తి భూముల కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారుకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. కొనుగోలుదారులకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని మంగళవారం న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
 
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన 83.11 ఎకరాల సత్రం భూములను వేలంలో రూ.22.44 కోట్లకే బినామీల ముసుగులో వారు దక్కించుకున్నారు. అత్యంత విలువైన సత్రం భూములను అధికార పార్టీ నేతలు వేలంలో తక్కువ ధరకే దక్కించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
 
రూ.1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ బంధు మిత్రులు వేలంలో రూ.22 కోట్లకే సొంతం చేసుకున్నారని, దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
 
కేవలం కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగానే మార్కెట్ ధర కంటే తక్కువగా భూములు విక్రయించారంటూ మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. సేల్ సర్టిఫికేట్‌లు ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను ఎమ్మెల్యే ఆర్కే స్వాగతించారు.

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments