Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలవంతపు భూ సేకరణ మానుకోండి... సిఆర్డిఏకు హైకోర్టు ఆదేశం.. రైతుల్లో ఆనందం

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (06:25 IST)
రాజధాని రైతులకు హైకోర్టు అండగా నిలిచింది. న్యాయం చేయడానికి తామున్నాం అనే భరోసా కలిగించింది. రాజధాని భూ సేకరణపై బలవంతంగా సేకరించరాదనే ఒకే ఒక్క తీర్పు రైతుల్లో ఆశలు రేపింది. వెంటనే ఇష్టం లేని రైతుల పేర్లను వారి భూమిని జాబితా నుంచి తొలగించండి అనే మాట ఆనందాన్ని నింపింది. రాజధాని ప్రాంతంలో భూసేకరణపై గురువారం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ ప్రాంతంలో పండగవాతావరణ నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.
 
రాజధాని నిర్మాణానికి రైతుల అంగీకారం లేకుండా భూములు సమీకరిస్తున్నారనీ, సారవంతమైన భూములను మినహాయించాలని కోరుతూ నిడమర్రు గ్రామానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలోనే సమీకరణకు సహకరించకపోతే భూ సేకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ఇతర మంత్రులు చెప్పడంతో భయపడిన రైతులు అంగీకారపత్రాలు ఇచ్చారు.
 
అనంతరం భయంతోనే భూములు ఇచ్చామంటూ తమ అంగీకారపత్రాలు తిరిగి ఇవ్వాలంటూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైకోర్టు భూసమీకరణకు ఇష్టం లేని రైతులను మినహాయించాలని, అదేవిధంగా భయంతో అంగీకారపత్రాలు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వాలనీ, దీనిపై 15 రోజులలో నివేదిక అంద జేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ ఆదేశాలతో రాజధాని ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. పంటలు పండించుకునేందుకు కూడా అనుమతి రావడంతో పొలాల్లో దుక్కులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments