Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని పిటిషన్లపై మరోమారు విచారణ వాయిదా

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (15:15 IST)
నవ్యాంధ్రకు మూడు రాజధానులు అంశంపై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. 
 
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని, పాలన వికేంద్రీకరణ జరుపుతామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత హైకోర్టులో అమరావతి రైతులు, మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. 
 
గతంలో హైకోర్టు సీజే‌గా ఉన్న జస్టిస్ జె.కె.మహేశ్వరి ఈ వ్యాజ్యాలను విచారించారు. తుది దశకు చేరుకునే సమయంలో అప్పటి ఆయన బదిలీ కావడంతో వ్యాజ్యాలను మళ్లీ మొదటి నుంచి విచారిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, చీఫ్ జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు సోమవారం పిటిషన్లపై విచారణ చేపట్టింది. రాజధాని కేసుల విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. 
 
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టుకే వదిలేశారు. ఈ క్రమంలో విచారణను నవంబరు 15వ తేదీకి హైకోర్టు వాయిదావేసింది. 
 
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది మార్చి 26న మొదటిసారి విచారణ జరిపి మే 3కు వాయిదా వేసింది. అనంతరం విచారణ సందర్భంగా.. కొవిడ్‌ నేపథ్యంలో న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఆగస్టు 23కు ధర్మాసనం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం