Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ మంత్రులు కాదు.. వెంకయ్య ఆ పని చేస్తే ప్రత్యేక హోదా ఖాయం : హీరో శివాజీ

ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం ఎలాంటి ఫలితం ఉండదని సినీ హీరో శివాజీ అభిప్రాయపడ్డారు. అదేపనిని ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు చేస్తే ఖచ

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (19:04 IST)
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం ఎలాంటి ఫలితం ఉండదని సినీ హీరో శివాజీ అభిప్రాయపడ్డారు. అదేపనిని ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గంలో నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావడం సంతోషకర పరిణామమన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఎవరు తీసుకువస్తారు, ఎవరు హీరోలవుతారనే విషయాలను పక్కనపెడితే .. వెంకయ్య నాయుడు ఒక్కడు కనుక తన పదవికి రాజీనామా చేస్తే ఆరోజున ప్రత్యేకహోదా వస్తుందన్నారు. 
 
ఆయన హీరో కూడా అవుతారు. ఈ విషయం ఆయనకు ఎవరైనా చెప్పినా బాగానే ఉంటుంది. లేదా, రాష్ట్ర ప్రజలకు సహాయం చేసిన వాడిని అవుతానని ఆయన రియలైజ్ అయితే బాగుంటుందన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేయడం వల్ల ఏపీకి అన్యాయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ఇది బీజేపీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments