Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చనిపోయాడు, 13 ఏళ్ల నుంచి ప్రియుడితోనే, అర్థరాత్రి ఆ పని చేసిపోయాడు

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (20:43 IST)
భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఇక అక్కడ ఉండలేక తన 13 యేళ్ళ కుమారుడితో కలిసి వేరే ప్రాంతానికి వలస వెళ్ళింది. అక్కడ కూలీ పనిచేసుకుంటూ ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కానీ ఉన్నట్లుండి అతని చేతిలోనే దారుణ హత్యకు గురైంది.
 
నందనవనం సమీపంలోని ఇంద్రసేనారెడ్డి నగర్ బస్తీ ప్రాంతమది. ఉన్నట్లుండి అరుపులు, కేకలు. తన తల్లి చనిపోయిందంటూ కొడుకు బయటకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
 
రంగంలోకి దిగారు పోలీసులు. మహిళది దేవరకొండ ప్రాంతంగా గుర్తించారు. తన భర్త అనారోగ్యంతో చనిపోతే 13 సంవత్సరాల క్రితం ఇంద్రసేనారెడ్డి నగర్ బస్తీకి వచ్చినట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన వెంటనే శ్రీకాంత్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందట.
 
ఈ విషయం స్థానికులందరికీ తెలుసు. అయితే శ్రీకాంత్ మద్యానికి బానిస. బాగా ఫుల్లుగా తాగి రోజూ ఇంటికి రాత్రిపూట వెళ్ళేవాడు. అర్థరాత్రి సమయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
 
తల్లి ఎంతకూ లేవకపోవడంతో కొడుక్కి అనుమానం వచ్చి స్థానికులకు చెప్పాడు. హత్యగా భావించి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రియుడు శ్రీకాంత్‌ను విచారిస్తే తనకేమీ సంబంధం లేదంటున్నాడు. రాత్రి సమయంలో శ్రీకాంత్ తప్ప వేరే వ్యక్తి లేకపోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments