Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోస్తా, రాయలసీమ జిల్లాలో 29, 30 తేదీల్లో భారీగా వర్షాలు?

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2015 (09:43 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్ష పాతం కూడా 7 నుంచి 12 సెంటీమీటర్ల భారీ, 13 నుంచి 24 సెంటీమీటర్ల అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 
 
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాలపైనా ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 
 
ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా 29వ తేదీన కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, 30న కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ బలమైన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలతో దక్షిణ కోస్తా జిల్లాలు కోలుకోకముందే, మరోసారి బలమైన అల్పపీడనం ఏర్పడటంతో ఐఎండీ వర్గాలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments