Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు

Webdunia
గురువారం, 27 జులై 2023 (11:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆ జిల్లాలో విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. దీనికి కారణం విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే. బుధ, గురువారాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించడంతో విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. 
 
విద్యార్థుల రవాణా, తరగతి గదుల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో తరగతులను నిర్వహించవద్దని కోరారు. భారీ వర్ష సూచనను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను మూసి వేసేలా పర్యవేక్షించాలని ఎంఈవో, డిప్యూటీ డీఈవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
 
ఇదిలావుంటే, మంగళవారం విశాఖ నగరంలో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నీటిమయమైంది. ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం నుంచి నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీళ్లన్నీ రోడ్లపైనే నిలిచివున్నాయి. దీంతో నగర వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పూడుకుపోయిన డ్రైనేజీలతో నీటి ప్రవాహం రోడ్లపైకి చేరి ముఖ్యమైన జంక్షన్లు చిన్నపాటి నీటి కుంటలను తలపిస్తున్నాయి. ఆర్కే బీచ్ రోడ్డులో కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments