Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో మళ్లీ భారీ వర్షం .. వణికిపోతున్న పట్టణ వాసులు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (14:25 IST)
తిరుపతిలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో పట్టణ ప్రజలు మరోమారు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి పట్టణం జలమయమైన విషయం తెల్సిందే. 400 యేళ్ల చరిత్రలో ఎన్నడూ అలాంటి వరదలు చూడలేదని తిరుపతి పట్టణ వాసులు చెబుతున్నారు. 
 
అయితే, గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలకు బ్రేక్ పడింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ, మంగళవారం ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో స్థానికులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తమిళనాడు, కర్నాటక, ఏపీల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుంది తెలిపింది. దీని ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments