Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో మళ్లీ భారీ వర్షం .. వణికిపోతున్న పట్టణ వాసులు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (14:25 IST)
తిరుపతిలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో పట్టణ ప్రజలు మరోమారు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి పట్టణం జలమయమైన విషయం తెల్సిందే. 400 యేళ్ల చరిత్రలో ఎన్నడూ అలాంటి వరదలు చూడలేదని తిరుపతి పట్టణ వాసులు చెబుతున్నారు. 
 
అయితే, గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలకు బ్రేక్ పడింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ, మంగళవారం ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో స్థానికులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తమిళనాడు, కర్నాటక, ఏపీల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుంది తెలిపింది. దీని ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments