Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌లో 69 శాతం పోలింగ్.. ఓటర్లకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు..

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2015 (09:53 IST)
వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో 69 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నిక అయినప్పటికీ ఓటర్లు ఆసక్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం గమనార్హం. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
 
పట్టణ, గ్రామీణ ప్రాంత ఓటర్లు భారీగా ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమయ్యారని అన్నారు. ప్రజలు వారికున్న ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని తెలిపారు. ఉప ఎన్నికలైనప్పటికీ ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఓటింగ్‌కు తరలివచ్చారని, క్యూలైన్లలో కొంతసేపు వేచివుండాల్సి వచ్చినప్పటికీ ఓపికగా నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారందరికీ అభినందనలు తెలిపారు.
 
ఇదిలావుండగా, వరంగల్ లోక్‌సభ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారీస్థాయిలో 10 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 69.01 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. 
 
ఈ పోలింగ్‌లో అత్యధికంగా పరకాల అసెంబ్లీ పరిధిలో 76.69 అత్యల్పం కాగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 48.03 శాతం పోలింగ్ నమోదైంది. పరకాల మండలం వరికోలు గ్రామంలో రికార్డు స్థాయిలో 90 శాతం ఓటింగ్ జరిగింది. ఉదయం ఏడు గంటల నుంచే చలిగాలులను సైతం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments