Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద‌కాకానిలో 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (10:41 IST)
గుంటూరు జిల్లా పెద‌కాకానిలో స్థానిక ఎన్నిక‌లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మార‌డంతో అక్క‌డ పోలీసుల నిఘా ఎక్కువ‌గా పెట్టారు. అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్ పోలింగ్ కేంద్రాల త‌నిఖీకి వ‌చ్చారు. వెంగళ్రావు పోలింగ్‌ కేంద్రం వివరాల‌ను ఆయ‌న‌కు సీఐ బండారు సురేష్‌బాబు వివ‌రించారు. 
 
 
పెదకాకాని సర్పంచి, వార్డు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ తెలిపారు. గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లను అర్బన్‌ ఎస్పీ పరిశీలించారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో స్థానిక సీఐ బండారు సురేష్‌బాబుకు ఎస్పీ పలు సూచనలు చేశారు. 

 
ఈ సందర్భంగా అర్బన్‌ ఎస్పీ మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 40 పోలింగ్‌ కేంద్రాలుండగా, లూథర్‌గిరి కాలనీ, వెంగళ్రావునగర్‌ కాలనీలో 16 సమస్యాత్మక బూత్‌లను గుర్తించామన్నారు. లూథర్‌గిరి కాలనీలో డీఎస్పీ స్థాయి అధికారిని కేటాయించన్నట్లు తెలిపారు. పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది సహకారం పోలీసులు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments