Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి కాదు.. ఎండల కొలిమి.. కాదు కాదు.. ఎండల ఉప్పెన వచ్చేస్తోంది..

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (10:39 IST)
వేసవి వచ్చేస్తోంది. ఎండలు మండిపోనున్నాయి. ఈ ఏడాది ఎండలు చాలా ఎక్కువగా వుంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న వేసవి కాలం.. గత రికార్డులను అధిగమించే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని చెప్తున్నారు.


తేమ గాలులు వీచే అవకాశాలు లేకపోవడమే ఇందుకు కారణమని, అల్ప పీడనాలు లేక, మబ్బులు కనిపించక సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుందని చెబుతున్నారు. దేశంలోని ఎన్నో ప్రాంతాలు 50 డిగ్రీలను మించిన వేడిమిని చూడనున్నాయని అధికారులు చెప్తున్నారు. 
 
ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తల్లో అత్యధికులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 2019 ఎండాకాలం గతంలో ఎన్నడూ చూడనంత ఉష్ణోగ్రతలను పరిచయం చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
 
సూర్యకాంతికి ఎల్ నినోలు తోడు కానున్నాయని, వీటి ప్రభావం ప్రజలపై అధికమని ఆంధ్రా యూనివర్శిటీ వాతావరణ విభాగం ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. దీంతో ఈ నెలాఖరు నుంచి ఎండలు మండిపోనున్నాయని, చిన్న చిన్న రిజర్వాయర్లలో నీరు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం ఉంది.

చలి కూడా మరో వారం పదిరోజుల్లో మాయమవుతుంది. ఆపై ఎండాకాలం మొదలు కానుంది. ఈ కాలంలో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments