Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బాలికను అనుభవించాడా? సరే ఈ 30 వేలు తీసుకుని కేసు వాపస్ తీసుకోండి

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (17:46 IST)
చిత్తూరు జిల్లాలో ఓ బాలిక శీలానికి రూ. 30 వేలు వెల కట్టారు. 15 ఏళ్ల బాలికను 30 ఏళ్ల యువకుడు మాయ మాటలు చెప్పి ఎక్కడెక్కడో తిప్పి ఆమెను అనుభవించి ఆ తర్వాత ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయాడు.
 
పూర్తి వివరాలను చూస్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లె పరిధిలోని శివాజీనగర్‌లో తల్లిదండ్రులు లేని 15 ఏళ్ల బాలికపై కన్నేసాడు 30 ఏళ్ల హరీష్. ఆమెకు మాయమాటలు చెప్పి గత 19వ తేదీన ఆమెను తీసుకెళ్లిపోయాడు. బాలిక ఆచూకి లభించకపోవడంతో ఆమె బంధువులు పోలీసులకి ఫిర్యాదు చేసారు. పోలీసులు బాలిక కోసం వెతుకుతుండగానే ఆమెను ఇంటి వద్ద వదిలివెళ్లాడు హరీష్.
 
ఇంటికి వచ్చిన బాలిక తనపై హరీష్ చేసిన వ్యవహారాన్నంతా చెప్పింది. దీనితో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐతే అదే రాత్రి హరీష్ తరపు పెద్దలు రూ. 30 వేలు ఇస్తామనీ, కేసు వాపసు తీసుకోమని చెప్పారు. అందుకు బాలిక బంధువులు అంగీకరించకపోవడంతో నిన్న రాత్రి బాలిక బంధువుల ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడి వారిని చితక్కొట్టారు. ఈ దాడిలో బాలిక బంధువులు పెద్ద రెడ్డెమ్మ, చిన్న రెడ్డెమ్మ గాయపడ్డారు. దాడి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమకు ప్రాణ హాని వుందని తమను రక్షించాలని పోలీసులను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments