Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూసమీకరణపై ఏపీ సర్కారుకు ఝలక్: రైతులకు ఇష్టం లేకుంటే..

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2015 (19:18 IST)
రాష్ట్ర రాజధాని కోసం తలపెట్టిన భూసమీకరణపై ఏపీ సర్కారు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఏపీ రాజధాని భూ సమీకరణపై రైతులకు ఊరటనిచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చేసుకోనివ్వడంలేదని నోటీసులు ఇచ్చిన రైతుల భూముల్లో పంటలకు ఆటంకం కలిగించవద్దని కోర్టు ఆదేశించింది. భూసేకరణకు సంబంధించి కొంత మంది రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 
 
దానిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ల్యాండ్‌ పూలింగ్‌కు ఇష్టపడని రైతుల భూములను భూ సేకరణ చట్టం ద్వారా సమీకరిస్తామని, పంటలకు ఆటంకం కలిగించకుండా, చట్ట ప్రకారమే ఆ ప్రక్రియ జరుగుతుందని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు.
 
దీనిపై ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments