Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 4 నుంచి ఒక్కపూట బడులు - ఉదయం 7.30 గంటలకే స్కూల్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (14:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపానికి చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటలకే రోడ్డుపైకి రావాలంటే జంకుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు జారీ చేశారు. 
 
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఒక్కపూట బడులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. 
 
అలాగే, ఏప్రిల్ 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే, ఏపీలో ఒక్కపూట బడులు ప్రారంభం రోజునే రాష్ట్రంలో కొత్త జిల్లాల నుంచి పరిపాలన కూడా ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments