Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హోదా' పేరెత్తితే జగన్ ఇబ్బందుల్లో పడతారు : జీవీఎల్ వార్నింగ్

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (14:48 IST)
ప్రత్యేక హోదా అనే అంశంపై వ్యవస్థలో లేదని, అందువల్ల మరోమారు హోదా మాటెత్తితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడతారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహా రావు సుతిమెత్తగా హెచ్చరించారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీఎం జగన్.. ప్రధాని మోడీకి లేఖ రాయడంపై జీవీఎల్ బుధవారం ఢిల్లీలో స్పందించారు. హోదా అనే వ్యవస్థే లేదని, అలాంటి లేని వ్యవస్థ కోసం మాట్లాడితే జగన్ రాజకీయంగా ఇబ్బంది పడతారని హెచ్చరించారు. 
 
ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా ఏపీకి కేంద్రం నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రాజెక్టుల కోసం రూ.22 వేల కోట్లు అదనంగా కేంద్రం ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని జగన్‌కు కూడా తెలుసునని అన్నారు. ప్రత్యేక హోదాను పునరుద్ధరించే ఉద్దేశం కేంద్రానికి లేదని జీఎల్ పునరుద్ఘాటించారు. 
 
అలాగే, రాజధాని వ్యవహారంపై కేంద్రం మంగళవారం లోక్‌సభలో చేసిన ప్రకటనపై కూడా స్పందించారు. రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందనే విషయాన్ని కేంద్రం వెల్లడించిందన్నారు. కానీ, కొంత మంది ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు వింటుంటే తనకు ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ప్రభుత్వ ప్రకటనలను, జవాబులను ఈవిధంగా వక్రీకరించడం తగదని హితవు పలికారు.
 
రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించిందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని అనేక సందర్భాల్లో తాను చెప్పానని అన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని, అది మారడానికి వీల్లేదని కేంద్రం నిర్ణయించినట్టుగా ప్రతిపక్ష నేతలు చెబుతుండటాన్ని అమాయక వ్యాఖ్యలో, మోసపూరిత వ్యాఖ్యలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రాజధాని అంశంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments