Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలిక సాగవ్... ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2015 (12:09 IST)
పూటకో ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలిక సాగవని కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ... పండగల పేరు చెబుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను పక్కదారి పట్టించారని ఆరోపించారు. 
 
తెరాస ప్రభుత్వానికి ఏ విషయంలోనూ ముందస్తు ప్రణాళికలు లేవని దుమ్మెత్తి పోశారు. పాలనను గాలికొదిలేసిన ప్రభుత్వం, ఉన్న నిధులను కూడా ఖర్చు చేయలేక పోతోందన్నారు. అలాగే కాకతీయ మిషన్ పేరుతో గులాబీ కార్యకర్తల జేబులు నింపారని, ఇపుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులు లేవని చెపుతున్నారన్నారు. 
 
మొన్నటికిమొన్న సచివాలయాన్ని కూల్చేస్తానని, ఇప్పుడు ఉస్మానియాను కూలుస్తామని చెబుతున్న కేసీఆర్ ఆటలిక సాగవని మండిపడ్డారు. మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, సాగర్‌ ఎడమ కాలువకు నీటి విడుదలపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments