Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ల రాజ్యం కావాలి.. మనోడినే గెలిపించుకుందాం : టీడీపీ నేత మోదుగుల

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (12:35 IST)
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి.. గురజాలలో మనోడినే గెలిపించుకోండి.. టీడీపీలో నా పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ ఆయన చేసిన వాఖ్యలు ఇపుడు కలకలం రేపుతున్నాయి. 
 
2009 ఎన్నికల్లో నర్సారావుపేట ఎంపీగా గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో ఆయన గుంటూరు పశ్చిమం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయనకు పార్టీలో సముచిత స్థానం లభించలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 
 
'తెలుగుదేశం పార్టీలో నా పరిస్థితి ఘోరంగా ఉంది. రెడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ' తన సామాజికవర్గాన్ని మిళితం చేసి వ్యాఖ్యానించారు. అదేసమయంలో గతంలో వైఎస్. రాజశేఖర్ రెడ్డి రెడ్ల కోసం ముఖ్యమంత్రి కాలేదు. పేదల సంక్షేమం కోసం ఆయన పని చేశారు. ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర కార్యక్రమం ఆయన చలవే. అందుకే రాబోయే రోజుల్లో రెడ్లరాజ్య రావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అని మోదుగుల వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments