Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెక్కింగ్ చేస్తూ జారిపడిన గుంటూరు టెక్కీ మృతి

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (08:40 IST)
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి మృతి చెందాడు. ఆదివారం కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ పర్వతారోహణకు వెళ్లాడు. ఈ మౌంటెన్ హిల్స్‌పై ట్రెక్కింగ్ చేస్తుండగా, 200 అడుగుల ఎత్తు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరుకు చెందిన శ్రీనాథ్ (32) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన ఆదివారం క్లీవ్‌లెన్స్ మౌంటెన్ హిల్స్‌కు తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్ళాడు. ఆయన పర్వతాన్ని ఎక్కుతుండగా 200 అడుగుల ఎత్తు నుంచి జారి కిందపడటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
కాగా, గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు - రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణితో, రాజేంద్ర నగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు ఐదేళ్ల క్రితమే వివాహమైంది. ఈ భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
 
గతంలో ఫ్లోరిడాలో ఉన్న వీరు ఇటీవల అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్ హిల్స్‌‌కు వెళ్లి మృత్యువాతపడ్డారు. శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments