Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో దారుణం : గ్యాస్ లీక్ చేసి మంటపెట్టిన దోపిడీ దొంగలు

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (14:05 IST)
గుంటూరులో దారుణం జరిగింది. దోపిడీ దొంగలు అత్యంత రాక్షసత్వంగా ప్రవర్తించారు. ఓ ఇంట్లో బంగారం, నగలు దోచుకున్న దోపిడీ దొంగలు.. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మంటపెట్టారు. ఈ మంటల్లో ఇంటిలో ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో ఒంటరిగా ఓ మహిళ ఉంటోంది. దీంతో ఆ ఇంట్లో దోపిడీ చేయడానికి కొంతమంది దొంగలు వెళ్లారు. ఇందులోభాగంగా ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసులతో పాటు ఇంట్లోని నగలు, నగదును దోచుకున్నారు. 
 
ఆ తర్వాత వంటింట్లోని గ్యాస్ సిలిండర్‌ను లీక్ చేసి మంట పెట్టి పరారయ్యారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఆమెను రక్షించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించి ఈ దారుణానికి పాల్పడిన దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments