Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలకు గల్లా జయదేవ్ గుడ్‌బై.... గుంటూరు ప్రజలకు ఆత్మీయ విందు

వరుణ్
ఆదివారం, 28 జనవరి 2024 (11:46 IST)
టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన గంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీలక రాజీకాయల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టంచేశారు. పైగా, ఇక నుంచి తన వ్యాపారాలపైనే పూర్తి దృష్టిసారిస్తానని ప్రకటించి, ఇంతకాలం తనను ఆదరించిన గుంటూరు ప్రజలకు ఆయన ఆత్మీయ విందు ఇచ్చారు.
 
రెండు సార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్.. ప్రస్తుతం గుంటూరు లోక్‌సభ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడైన గల్లా జయదేవ్... తన తల్లి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒకవైపు, మంచి వ్యాపారవేత్తగా రాణిస్తూనే ఎంపీగా రాష్ట్ర ప్రజలకు  సేవ చేశారు. ఆయనకు అమర రాజా బ్యాటరీస్ కంపెనీతో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి. 
 
సినీ నటుడు కృష్ణకు స్వయానా పెద్ద అల్లుడైన గల్లా జయదేవ్... హీరో మహేశ్ బాబుకు స్వయానా బావగారు. మహేశ్ బాబు సోదరి భర్త. ఎంపీగా రెండు పర్యాయాలు గెలిచిన ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. పైగా, రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆదివారం గుంటూరు ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, నేతలకు గల్లా జయదేవ్ ఆత్మీయ విందు ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments