Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఇంటి అద్దె చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (21:11 IST)
కరోనా వైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాలను ప్రశ్నార్థకంలోకి నెట్టేసింది. ఈ వైరస్ పుణ్యమాని దేశం మొత్తం లాక్డౌన్‌లోకి వెళ్ళిపోయింది. ఫలితంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారు. దీంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అనేక మంది తినేందుకు తిండిలేక అమలటిస్తున్నారు. ఇంకొందరు ఇంటి అద్దెలు చెల్లించలేక అష్టకష్టాలుపడుతున్నారు. 
 
తాజాగా గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తిని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఇంటి అద్దె చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక పోలీసు వర్గాల సమాచారం మేరకు.. మృతుడిని షేక్ జాన్ బాబుగా గుర్తించారు. 
 
నూడిల్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చిన ఈ చిరువ్యాపారి.. లాక్డౌన్ కారణంగా ఆర్థిక కష్టాల్లో కూరుకునిపోయాడు. దీంతో ఇంటి అద్దెను చెల్లించలేక పోయాడు. అదేసమయంలో అద్దె చెల్లించాలంటూ ఇంటి యజమాని ఒత్తిడి చేయడంతో ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇంటి అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని దుర్భాషలాడటం వల్లే షేక్ జాన్ బాబు ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments