Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండపానికి తొలి భార్య.... పెళ్లి పీటలపై నుంచి వరుడు పరార్!!

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (15:51 IST)
తిరుమల తిరుపతిలో ఓ ఆశ్చర్యక ఘటన జరిగింది. విడాకుల కేసు కోర్టులో ఉండగా ఓ వ్యక్తి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో పెళ్లిపీటలపై కూర్చొన్న వరుడు మండపం నుంచి పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాకేశ్ అనే వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పెండ్యాలకు చెందిన సంధ్య అనే మహిళపై ఇదివరకే వివాహమైంది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ దూరమయ్యారు. వీరిద్దరి విడాకుల కోర్టు ప్రస్తుతం కోర్టులో సాగుతుంది. ఆ విడాకుల పంచాయతీ ముగియకుండానే రాకేశ్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. 
 
తిరుమలలోని ఓ మఠంలో వివాహం చేసుకోబోతున్నట్టు మొదటి భార్య సంధ్యకు తెలిసింది. దీంతో ఆమె వెంటనే తన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని తిరుమలలోని వివాహం జరిగే కళ్యాణమండపానికి చేరుకుంది. అప్పటికే పెళ్లి పీటలపై కూర్చున్న వరుడు రాకేశ్.. సంధ్యను చూడగానే అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే స్పందించిన సంధ్య కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments