Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుల దుకాణం యజమానులకు షాకిచ్చిన జీవీఎంసీ

gvmc
Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (11:16 IST)
విశాఖపట్టణంలోని మందుల షాపుల యజమానులకు గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. దుకాణాల ముందు ఏర్పాటు చేసుకున్న బోర్డులకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించాలని ఇచ్చిన నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను చూసిన మందులషాపు యజమానులు ఒక్కసారిగా షాక్‌‍కు గురయ్యారు. 
 
'డిస్‌ప్లే డివైస్‌ ట్యాక్స్‌' పేరుతో వచ్చిన నోటీసులను చూసి ఖంగుతింటున్నారు. ఇలాంటివి అందుకోవడం ఇదే మొదటిసారని, 20, 30 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్న తమకు ఎప్పుడూ ఇలా రాలేదంటున్నారు. సాధారణంగా నగరపాలక, పురపాలక సంఘాలు వాణిజ్య, ఇతర దుకాణాల ప్రకటన బోర్డులు, గ్లో సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు, ఆర్చ్‌లపైన పన్నులు విధిస్తాయి.
 
మందుల దుకాణాలు అత్యవసర సేవల కిందకు రావడంతో వాటికి మినహాయింపు ఉంటుందని ఆ సంఘ నాయకులు పేర్కొంటున్నారు. గాజువాక, పెందుర్తి, సీతమ్మధార, చినగదిలి, మహారాణిపేట, గోపాలపట్నం, జ్ఞానాపురం, భీమిలి ప్రాంతాల్లోని అన్ని దుకాణాలకు జోన్ల వారీగా కొద్ది రోజుల క్రితం నోటీసులు అందజేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో పన్ను చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై కొందరు జీవీఎంసీ కమిషనర్‌కు లీగల్‌ నోటీసులు పంపినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments