Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా కళింగరత్న పురస్కారం అందుకున్న రాష్ట్ర గవర్నర్

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (21:33 IST)
చిన్నారుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకమైన చొరవతీసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. పుస్తక పఠనం విద్యార్థుల మేధోవికాసానికి బాటలు వేస్తుందన్నారు. ఒడిశాలోని కటక్‌లో శుక్రవారం జరిగిన ఆదికవి శ్రీ సరళాదాస్ 600వ జయంత్యుత్సవాల్లో ఉపరాష్ట్రపతి, ఆంధ్రప్రధేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఎపి గవర్నర్ హరిచందన్‌ను ఉపరాష్ట్రపతి కళింగరత్న పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయిడు మాట్లాడుతూ శ్రీ సరళాదాస్ ఒడియాలో విరచించిన మహాభారతానికి ఇన్ని శతాబ్దాలయినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదరణ అమూల్యమన్నారు. స్థానిక భాషలో, సరళమైన పదజాలంతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో జరిగే రచనలకు ఇదొక చక్కటి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
 
‘కళింగరత్న’ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు. పురస్కారం అందుకున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ మాట్లాడుతూ, చిన్నారుల ఆసక్తులకు అనుగుణంగా పున్తక రచన సాగాలన్నారు. మాతృభాషలో నేర్చుకున్నదేదీ మరవలేమని, చిరు ప్రాయంలో జరిగే అమ్మభాష బోధన వారి మనో వికాసానికి మార్గం చూపుతుందని వివరించారు.
 
శ్రీ సరళాదాస్‌ ఆదికవిగా సాహిత్యాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో అందించేందుకు కృషి చేసిన మహనీయుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రదాన్, ఆచార్య గణేశ్ లాల్, సరళసాహిత్య సంసద్ అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ స్వాయి సహా పలువురు ఒడియా కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments