Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో నరసింహన్‌జీ... ప్యాకేజీతో ఏపీ ప్రజలు హ్యాపీయేనా.. ఇంకేం కోరుతున్నారు.. మోడీ ఆరా

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై గవర్నర్ నరసింహన్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. 'ఏపీకి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ ఎలా ఉంది?... ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సంతోషంగా ఉన్నారా?

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:23 IST)
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై గవర్నర్ నరసింహన్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. 'ఏపీకి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ ఎలా ఉంది?... ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సంతోషంగా ఉన్నారా?... ఇంకా వారు కోరుకుంటున్నదేమిటి?.. ఏం చేస్తే బాగుంటుంది?' అని నరసింహన్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 
 
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన నరసింహన్‌ మంగళవారం మధ్యాహ్నం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరగ్గా... దాదాపు 20 నిమిషాలకుపైగా ఏపీ ప్యాకేజీపైనే ప్రధాని, గవర్నర్‌ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు కూడా వారి చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. 
 
ప్రత్యేకహోదా ఇవ్వడానికి ఉన్న అడ్డంకులను అన్ని పార్టీలకు వివరించి ఆ తర్వాత ప్యాకేజీపై ప్రకటన చేసి ఉంటే బాగుండేదని గవర్నర్‌ సూచించగా... ప్యాకేజీపై అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తే సమస్య మరింత జఠిలమవుతుందని మోడీ అభిప్రాయపడినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
 
అభివృద్ధి కావాలనుకున్న వాళ్లు ప్యాకేజీని స్వాగతిస్తారని, సమస్యలను సాగదీసి రావణకాష్టం చేయాలనుకున్న వారు మాత్రమే విమర్శలు చేస్తారని ప్రతిపక్షాలపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీకి ప్యాకేజీని ప్రకటించడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందని, ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి సమస్యలూ ఎదురుకావనే భావిస్తున్నామని, ప్యాకేజీ వల్ల అభివృద్ధి పథంలో ఏపీ దూసుకుపోవడం ఖాయమని ప్రధాని అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments