Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లకు ఆమాత్రం తెలియదా? గోరంట్ల బుచ్చయ్య

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (14:42 IST)
రాష్ట్రంలో వరద పరిస్థితి, రైతుల సమస్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలు అయితే 4 టీఎంసీల వరకు ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఒక్కసారిగా వరద ప్రవాహాన్ని దిగువకు వదిలితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలియదా? అని ప్రశ్నించారు. దాదాపు 220 టీఎంసీల నీరు వృథాగా పోయిందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. 
 
అంతకుముందు కృష్ణానది వరద ఉద్ధృతికి ముంపు బారిన పడిన ప్రాంతాలను తెదేపా నేతల బృందం పరిశీలించింది. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారితో వారు మాట్లాడారు. కృష్ణానదికి దిగువన ఉన్న ప్రాంత ప్రజలను సకాలంలో అప్రమత్తం చేయకపోవడం వల్లే భారీగా ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. 15 రోజుల ముందు నుంచే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కృష్ణానది వరద గురించి హెచ్చరికలు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదని వాపోయారు. 
 
బాధిత కుటుంబాలకు తాము అండగా నిలుస్తామని తెదేపా నేతలు హామీ ఇచ్చారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నష్టం అంచనా వేయాలని డిమాండ్‌ చేశారు. పరిహారాన్ని మొక్కుబడిగా ఇవ్వాలనుకోవడం సరికాదని, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే పూర్తిగా నీట మునిగిన నివాసాలకు కనీసం రూ.25 వేల వరకు అందించాలని డిమాండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments