Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

ఠాగూర్
గురువారం, 24 ఏప్రియల్ 2025 (09:36 IST)
వైకాపా మహిళా నేత, ఏపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంలో అదుపులోకి తీసుకుని, విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపితో పాటు విడుదల రజినిపై కేసు నమోదైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ అధికారులు గోపిని అరెస్టు చేశారు. 
 
పల్నాడు జిల్లా యడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు మాజీ మంత్రి విడదల రజిని, గోపి, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా, రజిని పీఏ రామకృష్ణలపై కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఏపీసీబీ కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోసం విడుదల రజినీ, గోపి హైకోర్టును ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారి జాషువా క్వాష్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు రిజర్వులో పెట్టింది. కాగా, స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments