Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపం వెలుగులో చదువుకున్నాడు.. సివిల్స్ 3వ ర్యాంక్ కొట్టాడు.. కోచింగ్ సెంటర్లను ఛీత్కరించాడు

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగుల పాటులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఒక అత్యంత సామాన్య వ్యక్తి ఆలిండియా స్థాయిలో సివిల్స్ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించి కోచింగ్ సెంటర్లకు గుణపాఠం నేర్పారు. ఒకటవ తరగతి నుంచి సివిల్స్ వరకు తెలుగు మీడియంలోనే చదివి, రాసి త

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (06:15 IST)
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగుల పాటులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఒక అత్యంత సామాన్య వ్యక్తి ఆలిండియా స్థాయిలో సివిల్స్ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించి కోచింగ్ సెంటర్లకు గుణపాఠం నేర్పారు. ఒకటవ తరగతి నుంచి  సివిల్స్ వరకు తెలుగు మీడియంలోనే చదివి, రాసి తెలుగుకు పట్టం కట్టిన ఈ అనితర సాధ్యుడిని చూసి ఇవ్వాళ తెలుగు భాష గర్వపడుతోందంటే అతిశయోక్తి కాదు. ఉపాధ్యాయునిగా వృత్తిని కొనసాగిస్తూనే 2006 నుంచి సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్న ఈయన నాలుగో ప్రయత్నంలో తన కల సాకారం చేసుకున్నారు.  1వ తరగతి నుంచి సివిల్స్‌ వరకు మాతృభాష తెలుగులో చదివి ఆల్‌ ఇండియా స్థాయిలో ర్యాంకు సాధించడం నిజంగా చరిత్రే అని సివిల్స్‌ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
అఖిల భారత స్థాయిలో సివిల్స్‌ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ. తల్లిదండ్రులు రోణంకి అప్పారావు, రుక్మిణి వ్యవసాయ కూలీలు. అన్నయ్య కోదండరావు ఎస్‌బీఐలో మేనేజర్‌. పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకూ తెలుగు మీడియంలోనే పలాస మండంలో చదివారు. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(ఎంపీసీ)లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్లలోని డైట్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 2007లో డీఎస్సీ రాసి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ)గా ఎంపికయ్యారు. 
 
ప్రస్తుతం పలాస మండలం రేగులపాడులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గోపాల కృష్ణ సివిల్స్ కోచింగ్ కోసం వెళ్లినప్పుడు పొందిన అవమానాలు, చీత్కారాలను సవాలుగా తీసుకుని తన జీవిత స్వప్నాన్ని సాకారం చేసుకున్నానని చెప్పారు. సివిల్స్‌లో తర్ఫీదు పొందడానికి హైదరాబాద్‌ వచ్చిన తనకు ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదురయ్యాయని కన్నీటి పర్యంతమవుతూ మీడియాకు వివరించారు గోపాలకృష్ణ. 
 
ఏ కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లినా నువ్వు పనికిరావంటూ అడ్మిషన్‌ ఇవ్వడానికే నిరాకరించారని, అయినా దేవుని దయ, అమ్మానాన్నల దీవెనలు, అన్నయ్య కోదండరావు స్పూర్తి, స్నేహితుల సహకారంతో పట్టుదలతో చదివానన్నారు. చిన్నప్పుడు తాను పడ్డ బాధలు తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి ప్రతీకారంతో ఈ విజయాన్ని సాధించానని స్పష్టం చేశారు.
 
తమ ఊరికి కరెంట్‌ లేకపోతే దీపం వెలుగులో చదువుకున్నానని, ఇప్పటికీ తమ ఊరికి న్యూస్‌ పేపర్‌ అంటే ఏమిటో తెలియదని చెప్పారు. తనకు ఎటువంటి అలవాట్లూ లేవని, ఆకలి, ఇతర అవసరాలు లేకపోతే చదువే తన లోకమని, అందులోనే ఆనందం పొందుతానని అన్నారు. 
 
దినపత్రికల సంపాదకీయాలు, ప్రత్యేక కథనాలను క్రమం తప్పుకుండా చదివి నోట్స్ తీసుకుని చదవడం తనకెంతో ఉపయోగపడిందని చెబుతున్న గోపాలకృష్ణ ఆకలిని, అవమానాన్ని, మాతృభాష సాక్షిగా తిప్పికొట్టి తెలుగు మాత్రమే చదువుకుని అత్యున్నత ర్యాంకును సివిల్స్‌లో సాధించడం ఈ దేశంలో సామాన్యులు సాధిస్తున్న అద్బుత విజయాలకు ప్రతిబింబం.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments