Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (10:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీ అయిన శుక్రవారం నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పంపిణీ చేస్తుంది. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 లక్షల మంది లబ్దిదారులకు ఈ పెన్షన్ కానుకను అందజేస్తున్నారు. 
 
ఏప్రిల్ 1వ తేదీన నేరుగా లబ్దిదారుల ఇంటి వద్ద, వారి చేతికి పెన్షన్ అందించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ పంపిణీ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. 
 
అయితే, ఏప్రిల్ 1న తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు. పెన్షన్ కోసం ప్రభుత్వం రూ.1551.16 కోట్లను కేటాయించిన విషయం తెల్సిందే. మొత్తం ఐదు రోజుల్లో 100 శాతం పెన్షన్ పంపిణీ పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments