Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతులకు శుభవార్త: మంత్రి బొత్స సత్యనారాయణ

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:04 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అద్దె రైతులకు శుభవార్త తెలిపింది. వార్షిక లీజు మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రూ.158 కోట్లలో రూ.9.73 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. ఈ డబ్బును త్వరలో రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హామీ ఇచ్చారు.
 
అంతకుముందు అమరావతి రైతులు మహిళలు బుధవారం సిఆర్డిఎ కార్యాలయంలో ధర్నా నిర్వహించడానికి ప్రయత్నించారు. తమకు చెల్లించని లీజు మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండు చేశారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించి రైతులకు నిన్ననే కౌలు చెల్లించామని అయితే సాంకేతిక కారణాల వల్ల అది జాప్యం జరిగిందని తెలిపారు. త్వరలోనే డబ్బులను చెల్లిస్తామని స్పష్టత ఇచ్చారు.
 
అమరావతి రైతులకు పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించామని అయితే ప్రతిపక్షాలు కేసులు వేయడం వల్ల అది సాధ్యపడలేదని తెలిపారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని, ప్రజా సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments