లాక్‌డౌన్ తర్వాత ప్రజా రవాణా అనుమానామే : జీవోఎం

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (09:59 IST)
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది మే నెల మూడో తేదీ వరకు ఉండనుంది. అప్పటివరకు ప్రజా రవాణా నిలిచిపోనుంది. ఆ తర్వాత కూడా ప్రజా రవాణా అందుబాటులోకి తీసుకుని రావడం కష్టమవుతుందని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. 
 
శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రులు, ప్రయాణాలను మే 15వ తేదీ తర్వాత అనుమతించే ఆలోచన చేయాలని సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, హర్దీప్ సింగ్ పూరిలతోపాటు ఉన్నతాధికారులు కొందరు హాజరయ్యారు.
 
'విమానాల సర్వీసులపై ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. ఇదేసమయంలో విమానాలను పార్కింగ్ చేసి ఉండటం ఆయా సంస్థల ఖర్చును పెంచుతోంది. మే 4 నుంచి కూడా ప్రయాణాలపై ఆంక్షలు ఉండవచ్చు. 15 తర్వాత పరిస్థితిపై తదుపరి సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి' అని ఇదే సమావేశానికి హాజరైన ఓ కేంద్ర సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. 
 
'దేశంలో విమానాలు, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు ఓ తేదీని నిర్ణయించలేదు. నిజం చెప్పాలంటే ఇందుకు కొంత సమయం పడుతుంది. ప్రజా రవాణా పునరుద్ధరణ అంటే, లాక్‌డౌన్ పూర్తిగా తొలగినట్టుగా భావించవచ్చు' అని మరో అధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఎయిర్ ఇండియా మే 4 నుంచి దేశవాళీ సర్వీసులకు, జూన్ 1 నుంచి విదేశీ సర్వీసులను టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments