Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో బంగారం బిస్కెట్లు... మల విసర్జన చేసి 16 బయటకు...

ఆ స్మగ్లర్ మామూలోడు కాదు. బంగారం స్మగ్లింగ్ చాలామంది లోదుస్తుల్లోనో, బెల్టుల్లోనో... తదితర మార్గాల ద్వారా చేరవేస్తుంటారు. కానీ శ్రీలంక దేశానికి చెందిన స్మగ్లర్‌ అబ్దుల్‌ రజాక్‌ మాత్రం బంగారం బిస్కెట్లను ఏకంగా మింగేసి విశాఖపట్టణానికి వచ్చాడు. కస్టమ్స్

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (13:56 IST)
ఆ స్మగ్లర్ మామూలోడు కాదు. బంగారం స్మగ్లింగ్ చాలామంది లోదుస్తుల్లోనో, బెల్టుల్లోనో... తదితర మార్గాల ద్వారా చేరవేస్తుంటారు. కానీ శ్రీలంక దేశానికి చెందిన స్మగ్లర్‌ అబ్దుల్‌ రజాక్‌ మాత్రం బంగారం బిస్కెట్లను ఏకంగా మింగేసి విశాఖపట్టణానికి వచ్చాడు. కస్టమ్స్ అధికారులు అతడిపై అనుమానం రావడంతో కెజిహెచ్‌కు తరలించి ఎక్స్‌రే తీయించగా కడుపులో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. దీనితో అతడిని ఆసుపత్రిలోనే వుంచారు. 
 
సోమవారం నుంచి మంగళవారం వరకూ మొత్తం 16 బంగారం బిస్కెట్లు మలవిసర్జన ద్వారా బయటకు వచ్చాయి. కాగా అతడికి ఇలా బంగారం బిస్కెట్లను మింగడం ఆ తర్వాత మల విసర్జన ద్వారా రప్పించడంలో నైపుణ్యం సాధించినవాడిగా కనుగొన్నారు. అందువల్లే అతడికి ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తలేదని తేల్చారు. కాగా ఇతడితోపాటు మరికొందరు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుని ఓ ముఠాలా మారి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments