Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు... విందులో గోదావరి రుచులు...

Webdunia
బుధవారం, 17 మే 2023 (09:42 IST)
తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జరుగనున్నాయి. రాజమండ్రి వేదికగా నిర్వహించే ఈ మహానాడుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ మహానాడుకు ఏకంగా లక్ష మంది, బహిరంగ సభకు 15 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహానాడుకు వచ్చే వారికి విందు భోజనం కూడా వడ్డించనున్నారు. ఇందుకోసం ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి గాంచిన వంటకాలను వడ్డించేలా చర్యలు చేపట్టారు. 
 
రాజమండ్రిలోని వేమగిరి వద్ద ఈ మహానాడు జరుగనుంది. ఈ ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల సుబ్బరాజు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 
 
ఈ మహానాడు ఏర్పాట్లపై వారు స్పందిస్తూ, మహానాడు తొలి రోజు ప్రతినిధులు సమావేశానికి లక్ష మంది వస్తారని తెలిపారు. ఆ తర్వాత రోజు జరిగే బహిరంగ సభకు దాదాపు 15 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. వీరందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విందులో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన అన్ని రకాల వంటకాలు వడ్డించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments