Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు... విందులో గోదావరి రుచులు...

Webdunia
బుధవారం, 17 మే 2023 (09:42 IST)
తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జరుగనున్నాయి. రాజమండ్రి వేదికగా నిర్వహించే ఈ మహానాడుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ మహానాడుకు ఏకంగా లక్ష మంది, బహిరంగ సభకు 15 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహానాడుకు వచ్చే వారికి విందు భోజనం కూడా వడ్డించనున్నారు. ఇందుకోసం ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి గాంచిన వంటకాలను వడ్డించేలా చర్యలు చేపట్టారు. 
 
రాజమండ్రిలోని వేమగిరి వద్ద ఈ మహానాడు జరుగనుంది. ఈ ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల సుబ్బరాజు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 
 
ఈ మహానాడు ఏర్పాట్లపై వారు స్పందిస్తూ, మహానాడు తొలి రోజు ప్రతినిధులు సమావేశానికి లక్ష మంది వస్తారని తెలిపారు. ఆ తర్వాత రోజు జరిగే బహిరంగ సభకు దాదాపు 15 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. వీరందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విందులో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన అన్ని రకాల వంటకాలు వడ్డించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments